నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు రాజకీయాల సందిగ్ధత తొలగడంలేదు. రేపు టీవీకే అధ్యక్షులు విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా అనిశ్చితి పూర్తిగా వీడలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే అధ్యక్షులు విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. లోక్ భవన్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు.. తొలుత కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. తాజాగా సీపీఐ, సీపీఐ(ఎం)తో పాటు వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించడంతో మెజార్టీ మార్కును చేరుకున్నట్లయింది. ఈమేరకు కాంగ్రెస్ పార్టీతో సహా ఉభయ కమ్యూనిష్టు పార్టీలు తమ మద్దతు లేఖలను గవర్నర్ కు పంపాయి. అయితే, వీసీకే పార్టీ మద్దతు ప్రకటించినప్పటికీ అధికారికంగా లేఖ ఇవ్వకపోడం వల్లే ఈ సందిగ్ధత నెలకొన్నట్టు తెలుస్తోంది.
The post తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ appeared first on Navatelangana.