← Back to headlines

ఇప్పుడు అమరావతి రాజధానికి జాతీయ చట్టబద్ధత ఉంది: లోకేష్

2026-05-11 07:43 • original

అమరావతి: అమరావతి నిర్మించే ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ భారత్ లో మోడల్ గా నిలుస్తుందని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. జెఐఎస్ సి మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు నుంచి మద్దతు, విధానాల ఖరారుకు జెఐఎస్ సి లోకేష్ కోరారు. ఎఇఆర్ అభివృద్ధికి ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్ పిపై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని, అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉందని లోకేష్ తెలియజేశారు. పెట్టుబడులకు ఇన్వెస్టర్ల లో విశ్వాసాన్ని పెంచుతుందని, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి అవకాశాలు పరిశీలించాలని సూచించారు. సింగపూర్ తరహాలో ఎపి ఒక గ్లోబల్ ఎంఐసిఇ గమ్యస్థానంగా మారాలన్నదే లక్ష్యమని, ఎపిలో అలాంటిది ఏర్పాటుకు సింగపూర్ సన్ టెక్ సిటీని అధ్యయనం చేస్తామని లోకేష్ పేర్కొన్నారు.