
హైదరాబాద్: జూన్ 2న ఆదిలాబాద్ లో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల విధివిధానాలు కేబినెట్ ఖరారు చేస్తామని అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో పొంగులేటి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నెల 21న జరిగే కేబినెట్ సమావేశంలో విధివిధానాలు ఖరారు అయ్యాయని, ఇందిరమ్మ ఇళ్ల కోసం స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని, క్యూర్ పరిధిలో 5 నుంచి 8 కి.మీ. పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు కేటాస్తామని, ఈ నెల చివరిలోగా హైదరాబాద్ లో ఇళ్ల స్థలాలు కలిగిన వారికి ఇళ్ల మంజూరు పత్రాలు అందజేస్తామని పేర్కొన్నారు. నియోజక వర్గం యూనిట్ గా స్థలాలు గుర్తించామని, అంగుళం ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనా సహించేది లేదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.