← Back to headlines

సంజీవ్ అరోరాకు ఏడురోజుల ఈడీ కస్టడీ

2026-05-10 09:16 • original

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: పంజాబ్ పరిశ్రమల మంత్రి సంజీవ్ అరోరాను గురుగ్రామ్ కోర్టు ఏడురోజుల ఈడీ కస్టడీకి పంపినట్లు అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మనీలాండరింగ్ కేసులో అరోరా అధికారిక నివాసం సహా పలు ప్రాంతాల్లో దాడులు జరిపిన అనంతరం శనివారం సాయంత్రం ఈడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అరోరాను చండీగఢ్ నుండి రోడ్డు మార్గంలో గురుగ్రామ్‌కు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈడీ పదిరోజుల రిమాండ్ కోరగా, గురుగ్రామ్ లోని పిఎంఎల్ ఎ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని మంత్రి తరపు న్యాయవాది తెలిపారు. మే 5న ఈడీ కేసు నమోదు చేసి, మే 9న అరోరాను అరెస్ట్ చేసిందని అన్నారు.

The post సంజీవ్ అరోరాకు ఏడురోజుల ఈడీ కస్టడీ appeared first on Navatelangana.