← Back to headlines

హార్ముజ్ జలసంధి వద్ద చెక్కపడవలో మంటలు

2026-05-09 17:43 • original

దుబాయ్ నుంచి శుక్రవారం యెమెన్ లోని ముక్కంకు బయలుదేరిన చెక్కపడవపై హార్ముజ్ జలసంధిలో కాల్పులు జరగడంతో మంటలు చెలరేగి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురికి కాలిన గాయాలయ్యాయని ప్రభుత్వ వర్గాలు శనివారం వెల్లడించాయి. 17 మందిని రక్షించారు. మృతుడు అల్తాఫ్ తలబ్ కేర్‌గా గుర్తించారు. ఇంజిన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నఅతడు గుజరాత్ లోని ద్వారకా కు చెందిన వాడని తెలుస్తోంది. దుబాయ్‌లోని భారత దౌత్య కార్యాలయానికి చెందిన అధికారులు గత రాత్రి బాధితులను కలుసుకున్నారు. చెక్కపడవ యజమానితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని అధికారులు చెప్పారు.